ఓం నమో పరమాత్మయే నమః
నారాయణుడు(పరమాత్మ)
నిత్యుడు, బ్రహ్మదేవుడు నారాయణుడే, శివుడు నారాయణుడే, ఇంద్రుడు నారాయణుడే,
భూమ్యాకాషములు నారాయణుడే, కాలతత్వము నారాయణుడే, దశాదిక్కులు నారాయణుడే,
ఊర్ద్వభాగమున ఉన్నదంతయు నారాయణుడే, అధోభాగమున ఉన్నదంతయు నారాయణుడే, మధ్యభాగమున
ఉన్నదంతయు నారాయణుడే, బహ్యాభ్యంతరముల యందున్న దంతయు నారాయణుడే. ఈ సమస్తము
నారాయణుడే, భూత భవిష్య ద్వార్తమానము లన్నియు నారాయణుడే, నారాయణుడు. నిష్కలంకుడు,
నిరంజనుడు, నిర్వికల్పుడు, వాక్కుచే నిర్వచింపశక్యము కానివాడు, శుద్దుడు, దేవుడు
,అద్వితీయుడు, అతడు తప్ప మరియొకడు ఎవడును లేడు – ఈ
ప్రకారముగా తెలిసికొను వాడు విష్ణువే యగు చున్నాడు.
మొదట ‘ఓమ్’ అని ఉచ్చరించవలెను. తదుపరి ‘నమో’ అని ఉచ్చరించవలెను. పిమ్మట’నారాయణ’ అని ఉచ్చరించవలెను. ఇదియే అష్టాక్షర మహామంత్రము.
ఎనిమిది ఎనిమిది అక్షరాములుకల ఈ మంత్రమును ఎవడు భక్తీ శ్రద్దలతో, ప్రీతితో,
విశ్వాసముతో స్మరణము చేయునో అతడు దీర్ఘాయుస్సు కలవాడగును; ప్రజాపతిత్వమును
పొందును. స్వర్గాదిపత్యమును బడయును. ధనదాన్యాది ఐశ్వర్యమును, సంపదను పొందును. ఎవడు
దీని నెరుంగునో అతడు అమృతత్వమును (మోక్షమును) బడయుచున్నాడు.
‘అ’కార, ‘ఉ’కార, ‘మ’కారములను ఈ మూడక్షరములను కలిపి ‘ఓమ్’ అను ప్రణవ మగుచున్నది. ఈ ప్రణవమునకు అర్ధము ప్రత్యగానందస్వరూపమగు
పరబ్రహ్మము. ఈ ఓంకారమును అర్ధయుక్తముగా స్మరణచేయు యోగి జనన మరణ రూప సంసారబంధనము
నుండి విడివడుచున్నాడు. ‘ఓం
నమో నారాయణ’ అను అష్టాక్షర మంత్రమును ఉపాసించువాడు
వైకుంఠలోకమును పొందుచున్నాడు. సర్వవ్యాపకమగు ఆ పరబ్రహ్మ హృదయ పుండరీకమందు
విజ్ఞానఘనమై, అంతర్యామిగా, అంతరాత్మగా ప్రకాశించుచున్నది. అది మెరుపువలె
ప్రకాశమానమైనది. పరబ్రహ్మ స్వరూపుడగు నారాయణుడు బ్రహ్మన్యుడు. సమస్తప్రాణులయందును
ఒక్కడే నారాయణుడు అంతర్యామియై వేలుగొందుచున్నాడు. అతడు సర్వవ్యాపియై ఈ సమస్త ప్రపంచమునకు
కారణభూతుడై, తనకు వేరొకకారణమేదియు లేనివాడై వెలయుచున్నాడు.
No comments:
Post a Comment