Wednesday, December 11, 2013

5.ముండకోపనిషత్తు :

ఓం నమో పరమాత్మయే నమః 

శునక ఋషి కుమారుడు ఉత్తమ గృహస్తుడని పేరు పొందిన వాడు ఐన శౌనకుడు శాస్త్రోక్తరీతిగా అంగీరస మహర్షిని సమీపించి వినమ్రుడై హే భగవాన్, దేనిని తెలుసుకోవడం చేత ఈ ప్రపంచం అంతా తెలుసుకోబడుతుంది? అని అడిగాడు.
అంగీరసుడు శౌనకునికి ఇలా బదులు చెప్పాడు. పరావిద్య అపరావిద్య అని తెలుసుకోవలసిన విద్యలు రెండు వున్నాయని బ్రహ్మవిదులు చెబుతారు.
ఈ రెండు విద్యల్లో నాలుగు వేదాలు, వేదంగాలైన శిక్షా, కల్పం, వ్యాకరణ, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిష్యము అన్నీ అపరా విద్యలే. ఇక శాశ్వతము అమరము ఐన తత్వాన్ని అందించే విద్యే పరవిద్య.
కళ్ళు మొదలైన వాటికీ గోచరంకానిది, చేతులు మొదలైన వాటికీ దొరకనిది, ఉత్పత్తిలేనిది, రంగు లేనిది, కళ్ళు చెవులు చేతులు కాళ్ళు లేనిది, శాశ్వతము అయినది , అంతటా వ్యపించినదీ, అత్యంతము సుక్ష్మమైనదీ సృష్టికి మూలకారణమైనదీ ఐన ఆ అక్షరాతత్వాన్ని జ్ఞానులు సకల జగత్తుకు మూలంగా అంతటా చూడగలరు.
సాలెపురుగు ఎలా తన గూడును నోటి నుండే వెలికితీసి తన లోకే తీసుకుంటుందో, భూమినుండి మూలికలన్ని ఎలా ఉద్భావిస్తాయో, మానవుని తలమీద, శరీరం మీద ఏ ప్రయత్నం లేకనే ఎలా పెరుగుతాయో అలాగే ఆ అక్షరాతత్వం నుండి ఈ విశ్వం ఉత్పన్నమవుతుంది.
సృష్టికర్త సర్వవిడుడు, జ్ఞానమే తపంగాగల బ్రహ్మ సకల ప్రాణులు వాటి ఆహారం అన్నీ పరబ్రహ్మం నుండి ఉద్భవిస్తున్నవి.
ప్రపంచిత అజ్ఞానంలో ఊరుతూ తామే ప్రజ్ఞాశీలురం, విదితవేదితవ్యులము అని ఆత్మస్తుతి చేసుకునే మూర్ఖులు రోగం, ముసలితనం, మృత్యువు వంటి దుఃఖ పరంపరలచేత మళ్ళీ మళ్ళీ పీడింపబడుతూ గుడ్డివాని నేతృత్వంలో నడిచే మరికొందరు గుడ్డివాల్లలా జన్మ జన్మలకు దారి తెలియక తిరుగాడుతూ వుంటారు.
అజ్ఞానంలో మునిగివున్న ఈ మూర్ఖులు తామే కృత క్రుత్యులమని భావిస్తుంటారు. ఎందుచేతనంటే కర్మఫలాలపట్ల ఆసక్తి ఉన్నంతవరకు వారికీ జ్ఞానోదయం కాదు. అందుచేత పుణ్యకర్మల ఫలితామైన స్వర్గాది లోకాలు అనుభవించాక వారికీ మళ్ళీ అధోగతే !
ఈ మందబుద్దులు యజ్ఞకర్మలు, పుణ్యకార్యాలు మాత్రమే సర్వోత్తమమైన వనుకుంటూ అంతకు మించినది లేదనుకుంటారు. వీళ్ళు భోగాలకు పుట్టినిల్లయిన స్వర్గ లోకాలలో తమ పుణ్యఫలాన్ని అనుభవించి మళ్ళీ ఈ లోకాన్ని వదిలి హీనమైన లోకాల్లో ప్రవేశిస్తారు.
శాంతచిత్తులు, విద్వాంసులు బిక్షాటనవ్రతులై అడవిలో ఏకాంతంగా శ్రద్దాపూర్వకమైన తపోనిష్టతో జీవితాన్ని గడిపే సత్పురుషులు పాపధూలలిని కదిగివేసుకొని సుర్యమార్గం ద్వార శాశ్వతం అక్షయం ఐన తత్వం వుండే చోటికి చేరుతారు.
వివిధ కర్మలద్వార ప్రాప్తించే లోకాలను పరీక్షించి ముముక్షువు వానిపట్ల వైరాగ్యాన్ని వహించాలి. కర్మలవల్ల పరతత్వాన్ని పొందలేము ! అందుచేత ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి అతడు విద్యుక్తంగా వేదవిదుడు, బ్రహ్మనిష్టుడు ఐన గురువువద్ద శిష్యరికం చేయాలి.
సత్యం ఇదే: జ్వాలలు లేస్తున్న మంటలనుండి అటువంటివే నిప్పురవ్వలు వేలకొలది ఎలా పుట్టుకోస్తాయో సరిగా ఆ విధంగానే అక్షరమైన బ్రహ్మంనుండి నానా విధాలైన జీవులు ఉద్భవిస్తాయి. మళ్ళీ అందులోనే విలీనమవుతాయి.
స్వతః ప్రకాశం, నిరాకారం, అనాది శుద్ధం, సర్వవ్యాపకం ఐన ఆ తత్వం లోపల వెలుపల కూడా వుంది. జీవానికి మనస్సుకు ప్రాచీనమైన ఆ తత్వం అవ్యక్తమై జగత్తు కారణ రూపానికి కూడా అతీతమైనది.
ఆ తత్వం (పరమాత్మా) నుండే జీవం, మనస్సు, అన్ని ఇంద్రియాలు,గాలి, ఆకాశం, నిప్పు, నీళ్ళు, సకలాధారమైన భూమి అన్నీ పుట్టాయి.ఈ విధంగా సర్వవ్యాపి ఐన ఆ తత్త్వం నుండే అన్ని జీవులు పుట్టుకొచ్చాయి.ఈ తత్వమే సర్వభూతాలలోను ఉన్న అత్మకుడా.
ఆ తత్వం నుండి వివిధ లోకాలు, ఆ లోకలోలోని దేవతలు, సాద్యులు, మానవులు, జంతువులూ, పక్షులు ఉచ్ఛ్వాసనిశ్వాసాలు, వారి యువాధాన్యాలు, తపస్సు, శ్రద్ధ, సత్యం, బ్రహ్మచర్యం విదినిశేదాలు అన్నీకూడ పుట్టుకొచ్చాయి.
ఆ పరతత్వం నుండి ఏడూ ఇంద్రియాలు, వాటి గ్రహనశక్తులు, వాటి విషయాలు, వాటి జ్ఞానం, హృద్గుహలలో వుంటూ జీవశక్తులు సంహరించే ఏడేడు లోకాలు, అన్నీ ప్రభవిస్తాయి. ఇవన్నీ ఎడేడుగా భగవంతుడే సృష్టించాడు.
అన్ని సముద్రాలూ, పర్వతాలు కూడా భగవంతుడు నుండే ఉద్భవిస్తాయి. అన్ని నదులు ఆయననుండే ప్రవహిస్తాయి. ఏ మూలికల రసాలుచేత పోషింపబడి పంచాభూతాలచేత అవరింపబడిన సూక్ష్మశరీరం వుంటున్నదో ఆ ములికలన్నీ ఆ పరతత్వం నుండే సంభవిస్తున్నాయి.
స్వగతమైన ఆ తత్వం యజ్ఞకర్మలు జ్ఞానం తపస్సు అన్నియు ఈ సమస్తంలోను వున్నది. ఓ సౌమ్యుడా! హృద్గులలో ఒదిగిఉన్న సర్వ శ్రేష్టము అమరము ఐన బ్రహ్మము ఆ తత్వమే అని తెలుసుకున్నవాడు అవిద్యాగ్రంధిని తెంచివేసి ఈ జన్మలోనే ముక్తుడవుతాడు.
అన్ని అనుభావాలలోను ప్రత్యక్షమయ్యేది అత్యంత సమీపంలో ఉన్నది. హృద్గుహలో ఉన్నది ఐన ఆ బ్రహ్మం అన్నింటికీ ఆశ్రయం. కదిలేవి, స్వాశించేవి, రెప్పలార్చేవి, ఆర్చనివికూడా సమస్తము ఆ బ్రహ్మములోనే ప్రతిష్టితమై ఉన్నవి. స్తూలసూక్ష్మలకు కారణం సర్వారాధ్యం, సర్విత్క్రుష్టం, విజ్ఞానానికి కూడ అతీతమైన ఆ బ్రహ్మాన్ని తెలుసుకో.
ప్రకాశవంతం అణువుకంటే సూక్ష్మం ఐన ఆ అక్షరాబ్రహ్మం సకల లోకాలకు ఆ లోక వాసులకు కూడా నిలయం. ఆ బ్రహ్మమే ప్రాణం వాక్కు మనస్సు స్వద్వస్తువు అమరత్వంకూడ.
ఉపనిషత్తులు అందించే మహాస్త్రాన్ని ధనస్సుగా తీసుకో. నియమానుసారం నిత్యం చేసే ఉపాసనలవలన తీక్ష్ణమైన బాణాన్ని ఎక్కుపెట్టు. ఎటూ చెదరకుండా బ్రహ్మచింతనలోనే కేంద్రీకృతమైన మనస్సుచేత వింటినారిని చేవిదాకా లాగు! నాశంలేని బ్రహ్మమే లక్ష్యం. ఆ బ్రహ్మాన్ని తెలుసుకో.
ఓం అనే ప్రణవమంత్రమే ధనుస్సు. లోనున్న ఆత్మయే బాణం. బ్రహ్మమే లక్ష్యం. ఏమరపతులేని మనస్సుతో ఆ లక్ష్యాన్ని చేదించాలి. బాణం లక్ష్యాన్ని చేదించి దానితో ఒకటైపోయినట్లే బ్రహ్మంతో ఐక్యమైపోవాలి.
భూమ్యాకాశాలు వాటి మధ్యనున్న అంతరాళము, మనస్సు పంచప్రాణాలు దేనియందు పడుగు పేకగా అల్లుకొని ఉన్నాయో అదే ఆత్మ అని తెలుసుకో. తదితరమైన వ్యర్ధప్రసంగల్లు వదిలిపెట్టు. ఈ సంసారసాగరాన్ని దాటి అమరత్వం ఇచ్చే సేతువే ఇదే.
ఈ భూమిపైన కనిపిన్చేదంతకుడా ఆ ఆత్మవైభవమే. హ్రుదయాకాశంలోని జ్యోతిర్మయమైన బ్రహ్మపురిలో దాని నివాసం.మనస్సే దానికి వస్త్రం. ప్రాణ శరీరాలకు అది అధినేత. హృదయంలో స్థిరపడి అది శరీరమంతట నివసిస్తుంది. పరిపూర్ణమైన విజ్ఞానంచేత ప్రాజ్ఞులు ఆనందమయమైన ఆ అమరత్వస్తితిని సాక్షాత్కరించుకుంటారు.
ఎగుడు దిగుడులలో కూడా ఆత్మను సాక్షాత్కరించుకోవడం వలన అతని అజ్ఞానపు ముడి విడిపోతుంది. అన్ని సంశయాలు సమసిపోతాయి. అన్ని కర్మలు క్షయించిపోతాయి.
జ్యోతిస్వరుపమైన ఆ ఆనందమయకోశంలో మానవుని నిగూఢ గహనాలలో నిర్మలంనిరవయవం విశుద్ద్డం ఐన బ్రహ్మం వాసం చేస్తుంది. కాంతి నిచ్చే అన్నింటికీ కాంతి అదే. దాన్నే ఆత్మవిదులు సాక్షాత్కరించుకుంటారు.
అక్కడ సూర్యుడు ప్రకాశించాడు. చంద్రుడు తారలు వెలుగు నీయవు. మెరుపులుకుడా కాంతి నీయవు. ఇక కేవలమైన అగ్ని మాట చెప్పడమెందుకు? ఆత్మ తేజస్సు వళ్ళ మాత్రమే సర్వము కాంతులీనుతుంది! ఈ యవద్విశ్వము ఆ ఆత్మజ్యోతి వల్లనే దేదీప్యమానమవుతూ ఉన్నది.
నిజంగా ఇదంతా శాశ్వతమైన బ్రహ్మే. కింద మీద ఈ పక్క ఆ పక్క ముందు వెనక సర్వత్రా ఆ బ్రహ్మం విరాజమానమై ఉన్నది. నిజంగా ఈ యవద్విశ్వం సర్వోత్క్రస్టమైన ఆ బ్రహ్మమే.
ప్రాణ స్నేహితులై ఎప్పుడూ కలిసి ఉండే రెండు పక్షులు ఒకే చెట్టుపైన కూర్చొని ఉన్నవి. వాటిలో ఒకటి చెట్టు పండ్లను ఆశక్తితో తింటుంది. మరొకటి ఏమి తినకుండా చూస్తూ ఉన్నది.ఒక చెట్టుమీద కూర్చొని ఉన్న ఆ రెండింటిలో ఒకటి జీవాత్మ. అజ్ఞానంలో భ్రమలో మునిగి తన దౌర్భల్యానికి దుఃఖిస్తున్నది. కానీ ఆరాధనీయమైన ప్రభువైన దానిని, పరమాత్మను, దాని వైభవాన్ని చూడగానే దాని దుఃఖమంతా తరిగిపోతున్నది.
స్వయంప్రకాసమైన, సృస్టికర్తయైన బ్రహ్మకుకూడ ఆదియైన, సకల జగత్తుకు కర్తయైన, ప్రభువైన పరమాత్మను సాక్షాత్కరించుకోగానే విద్వాంసుడైన సాధకుడు పుణ్యపాపాల నతిక్రమించి దుఖఃరహితము సర్వోత్క్రస్టము అయిన సమస్తితిని చేరుకుంటాడు.
ప్రాణమై ఆ ఈశ్వరుడే సకల జీవులలో ప్రకాశిస్తున్నాడు. ఇది సాక్షాత్కరించుకున్నవాడు వాక్కును నిగ్రహించి, నిజమైన విద్వాంసుడవుతాడు. అతడు నిత్యం అత్మయందే విహరిస్తూ అత్మయందే ఆనందిస్తూ పున్యకర్మలను చేస్తూ బ్రహ్మజ్ఞానులలో అగ్రస్థానం వహిస్తాడు.
ఆత్మనిగ్రహం గలవారు తమలోని పాపకల్మశం లేశమాత్రం కూడా లేకుండా క్షయించిపోగ జ్యోతిర్మయం పరిశుద్ధం ఐన ఆత్మను సాక్షాత్కరించుకుంటారు. సత్యం తపస్సు ధ్యానం జ్ఞానం బ్రహ్మచర్యం చక్కగా నిరంతరాయంగా అభ్యసించడంచేత ఆ ఆత్మ మనస్సులోనే లభ్యమవుతుంది కదా!
అపరిమితమైన జ్యోతిస్వరూపం ఊహాతీతమై బ్రహ్మం ప్రకాశిస్తుంది. అది సూక్ష్మతి సూక్ష్మం, అది ఇక్కడే ఈ శరీరలోనే ఉన్నది. ఋషులు హృదయస్తమై ఉన్నదానిని ఈ జన్మలోనే సాక్షాత్కరించుకుంటారు.
ఆత్మను మాటలచేత వర్ణింపనలవికాదు, దాన్ని కళ్ళు చూడలేవు. ఇంద్రియాలు గ్రహించలేవు. కర్మలు విధులు దానిని ఆవిష్కరించలేవు. అవబోధ ప్రశాంతమై స్వచ్చమైనపుడు అతని ప్రాణ మన శరీరాలు సర్వం విశుద్ది పొందుతాయి. అపుడు ధ్యానమగ్నుడైనవాడు ఆత్మను సాక్షాత్కరించుకుంటాడు.
ప్రాణం ఐదు విధాలుగా వ్యాపించి ఉన్న ఈ శరీరంలో సుక్ష్మమైన అత్మతత్వాన్ని విజ్ఞానం ద్వార తెలుసుకోవాలి. మానవుని జ్ఞానాన్ని ఇంద్రియాలు చిక్కగా అల్లుకొని వున్నాయి. ఆ జ్ఞానం స్వచ్చం నిర్మలం కాగానే ఆత్మ అందులో భాసిస్తుంది.
ఆత్మసాక్షాత్కారం పొందినవాడు ఉజ్వలమై ప్రకాసించేది, సకల జగత్తుకు ఆధారమైనది ఐన బ్రహ్మాన్ని తెలుసుకుంటాడు. అట్టి పురుషుని పట్ల నిష్కాములై శ్రద్దాలువులైనవారు పునర్జన్మ బాధను దాటిపోతారు.
ఇంద్రియభోగాలను పదే పదే తలుచుకుంటూ వాటికోసం ఆరాటపడేవాళ్ళు ఆ కోరికలు తీరడానికి అక్కడక్కడ జన్మలెత్తుతారు. కానీ ఆత్మ లభంపొంది అన్ని కోరికలను ఆత్మలో నేలయం చేసిన ధన్యుడికి ఈ జన్మలోనే అన్ని కోరికలు అదృశ్యమై పోతాయి.
గొప్ప ఉపన్యాసాలు ఇవ్వడంచేతగాని చాల శాస్త్రాల అధ్యయనం చేయడంవలనగాని ఎన్నో గుడార్థాలు మహాత్ములవడ్డ వినడం వలన గాని అత్మప్రాప్తి జరుగదు. ఆ ఆత్మకోసం హృదయపూర్వకంగా ఆరాటపడి మనన నిధి ధ్యాసలు చేసే వ్యక్తికే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. అట్టి వ్యక్తికే ఆత్మ తన స్వరూపాన్ని వెల్లడిస్తుంది.
ఆత్మ మనోబలం లేనివారికి, అజగ్రత్తపరులకు, శాస్త్రవిరుద్దమైన తపస్సులు చేసేవారికి లభించదు. అయితే ధృడంగా శ్రద్ధ వుంచి తగిన విధంగా ప్రయత్నించే వారి ఆత్మ బ్రహ్మ పదంతో ఐక్యం పొందగలదు.
అత్మలాభం పొందిన ఋషులు అత్మజ్ఞానంతో సంతుస్టులవుతారు. ఇక వారికీ కావలసిందేమిలేదు. వారు పరమాత్మస్వరూపులు సంగారహితులు శమించిన ఇంద్రియాలు కలవారు. సర్వవ్యాపియైన బ్రహ్మాన్ని ఎల్లెడలా సాక్షాత్కరించుకొని ప్రాజ్ఞులైన ఆ వినీతమతులు అన్నింటా ప్రవేశిస్తారు.
వైరాగ్యమయమైన జీవనం ద్వార నిరంతరభ్యాసం ద్వార పవిత్రస్వభావులై, వేదవేదంటలు అన్వేషించి పరమాత్మయందే సుస్థిరులైన సాధకులు సాక్షాత్కర సమయంలో అమరులై బ్రహ్మీభుతులవుతారు.అన్నివిధాల ముక్తులవుతారు.
వారి పదిహేను అంశాలు వాటి స్థావరాల్లోకి చేరిపోతాయి. ఇంద్రియాలు వాటి వాటి అదిదేవతలలో లీనమవుతాయి.వారి కర్మలు, జీవాత్మ పరమమైన అక్షయతత్వంలో ఐక్యమవుతాయి.
ప్రవహించే నదులు వాటి పేర్లను ఆకారాలను కోల్పోయి ఎలా సముద్రంలో ఏకామవుతాయో అలాగే జ్ఞానికూడా తన నామరూపాల నుండి ముక్తుడై సర్వోత్క్రుస్టం దీప్యమానం ఐన పరబ్రహ్మతత్వంలో లీనమవుతాడు.

ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకున్న ప్రతివాడు పరబ్రహ్మమే అవుతాడు.హృదయగ్రందులు కరిగిపోగా అతడు శోకపాపాలకు అతీతుడై శాశ్వతమైన అమరత్వాన్ని అందుకుంటాడు.

No comments:

Post a Comment