Wednesday, December 11, 2013

6.మండుక్యోపనిషత్ :

ఓం నమో పరమాత్మయే నమః 

ఈ సమస్త ప్రపంచం ఓమ్ అను అక్షరము (ప్రణవము) ఓంకారం నాశరహిత పరబ్రహ్మము.భూతభవిష్యద్వర్తమానములన్నియును ఓంకారమే. త్రికాలములను దాటియుండునది ఓంకారమే.
ఓంకారమని చెప్పబడిన ఈ సమస్త ప్రపంచము బ్రహ్మమే. అంతయు బ్రహ్మమే. ఈ జీవుడును బ్రహ్మమే. అట్టి ఓంకారము (బ్రహ్మము,ఆత్మ) నాలుగు పాదాలు కలిగివున్నది.
ఈ ఆత్మయే సర్వేశ్వరుడు. సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సమస్త ప్రాణుల యొక్క ఉత్పత్తి వినాశములయందు అన్నిటికిని అదియే కారణభూతమై యున్నది.
ఈ ఆత్మ అంతఃప్రజ్ఞ (తైజసుడు) కాదు. బహీప్రజ్ఞ (విశ్వుడు) కాదు. ఈ రెండింటికిని మధ్య నుండునదియు కాదు. ప్రజ్ఞానఘనము కాదు; ప్రజ్ఞ కాదు; అప్రజ్ఞయు కాదు; అది అదృశ్యము, వ్యవహరించుటకు వీలులేనిది; ఇంద్రియములకు అందనిది. తలన్చుటకు సాధ్యము కానిది. ఇట్టిదని నిర్ణయించి చెప్పుటకు సాధ్యము కానిది. ఏకాత్మ యనెడు విశ్వాసము సారముగ గలది.లోకవ్యాపరము లేనిది. శాంతమైనది. మంగళకరమైనది. ఏకమైనది. ఈ ఆత్మయే తెలిసికొనుటకు తగినది.ఇది నాలుగవ పాదము.

ఓంకారమును ఆకారాది మాత్రలును విశ్వాది పాదములను లేని సమస్త ద్వైతోపశమనము కల మంగళస్వరూపముగా తెలిసికొనినవాడే తత్వవేత్త,జ్ఞానీ మరియు యోగి అయియున్నాడు. మరియొకడు కాడు. ఆ విధంగా ఆత్మ తత్వమును తెలుసుకొనిన వాడు ఆత్మ చేత ఆత్మను పొందుతున్నాడు.       

No comments:

Post a Comment