ఓం నమో పరమాత్మయే నమః
పరమహంసయగువాడు
తనచిత్తమును నాయందే (భగవంతుని యందే) స్థాపించును. కాబట్టి నేనును అతనియందు
ఉండుచున్నాను.
పరమహంస సమస్త
కర్మలను త్యజించి బ్రహ్మాండమును (బ్రహ్మాండ భావమును) కూడ వదలివైచి (ఆత్మపరాయణుడై)
యుండును.
పరమహంస తన దేహమును
శవము మాడ్కి (జడముగ) చూచును.
పరమహంస కోరిక
లన్నింటిని త్యజించివైచి అద్వైత పరమాత్మయందు మనస్సును స్థాపించియుండును.
జ్ఞానదండమును ఎవడు
ధరించునో అతడు ‘ఎకదండి’ సన్యాసి యనబడును.
ఎవడు కేవలము
కాష్టదండమును మాత్రము గ్రహించిన వాడను, ప్రాపంచిక భోగము లన్నింటిని
అనుభావించువాడును, ఆధ్యాత్మిక జ్ఞానము లేనివాడును, తితిక్ష (ఓర్పు), జ్ఞానము,
వైరాగ్యము, శమదమాదిగుణములు లేనివాడును, భిక్షాచరణ మాత్రముతో కాలమును గడపువాడును
అయియుండునో అతడు పాపియు యాత్యాశ్రమవృత్తిని నశింపజేసినవాడును అగును.
No comments:
Post a Comment