Wednesday, December 11, 2013

4.ప్రశ్నోపనిషత్తు :

ఓం నమో పరమాత్మయే నమః 

మీరు మరల ఒక సంవత్సరము వరకును తపస్సుతోను, బ్రహ్మచర్యముతోను, శ్రద్దతోను నివసింపుడు, తదుపరి మీయిష్ట ప్రకారము ప్రశ్నలను అడుగుదురు. మే మేరుగుదు మేని సర్వమును మీకు వచింపగలము.
కొందరు మహనీయులు ఉత్తరామార్గామును అవలంబించి తపస్సు, బ్రహ్మచర్యము, శ్రద్ధ, విద్య – వీనిచేత ఆత్మ నెరింగి ఆత్మరూప సూర్యలోకమును (అంటే మనకు కనిపించే  సూర్యగ్రహం కాదు) జయించుదురు. ఈ ఆత్మ రూప సూర్యుడే ప్రాణాధారము. ఇది అమృతము, భయరహితము, అన్నిటికంటేను శ్రేష్టమైనగతి. ఇచ్చటినుండి మరల తిరిగి వచ్చుట లేదు. పునర్జన్మ లేదు.
ఓంకార స్వరూపమును ఏ విజ్ఞుడు తెలిసికొనుచున్నాడో అట్టివాడు శాంతమై, అజరమై, అమృతమై అభయమైనట్టి పరబ్రహ్మమును పొందుచున్నారు.

రథచక్రమందలి ఆకులవలె సమస్తకళలు ఎవనియందు ప్రతిస్టితములై యున్నవో, అట్టి వేద్యుడగు పురుషుని (ఆత్మను) పొందుడు. మిమ్ము మృత్యువు బాధింపక యుండును.         

No comments:

Post a Comment