Wednesday, December 11, 2013

8.ఐతరేయోపనిషత్తు:

ఓం నమో పరమాత్మయే నమః 

సృష్టికి పూర్వం భగవంతుడు ఒక్కడు మాత్రమె ఉన్నాడు. వేరొకటి అంటూ ఏదియును లేదు. లోకాలను సృష్టించాలి అని అనుకున్నాడు. సృష్టించాడు.
లోకాలను సృష్టి చేశాను. ఇక లోకరక్షకులను సృష్టిస్తాను అని అనుకున్నాడు. నీటి నుండి పైకి తీసి బ్రహ్మదేవున్ని సృష్టించాడు.
లోకపాలకులను సృష్టించిన తరువాత, నడినెత్తి చీల్చుకొని భగవంతుడు ఆ ద్వారం గుండా లోపలి ప్రవేశించాడు. ఆ ద్వారం పేరు విద్రుతి. ఆనందం కొలువైన స్థానం.  
భగవంతుడు ఇదంద్రుడు అని చెప్పబడుచున్నాడు. అవును నిశ్చయంగా అయన ఇదంద్రుడే. ఎందుకంటే ఇదో అని కనిపించేవాడిగా కూడ ఉన్నాడు. అందుకే ఆయనను పరోక్షంగా పేర్కొంటున్నారు.
మహాచైతన్యం పదార్థమైన ఆత్మే సృష్టికర్తగాను, దేవతలగాను(పంచ భూతాల అధిపతులగాను), ప్రకృతిగను (భూమి, ఆకాశం, గాలి, అగ్ని మరియు జలము) అనే ఐదు మౌలిక మూలకాలుగాను అదే ఉన్నది. సమస్త ప్రాణి కోటి మరియు సమస్త జీవరాసులు కూడా ఆ ఆత్మనే అయి వుంది. స్థావర జంగామాలు అన్నీ ఆత్మే. సమస్తం ఆత్మ మార్గదర్శకంలో నడుచుకుంటున్నాయి. అన్ని ఆత్మలోనే నేలకోనివున్నాయి. లోకమంతా ఆత్మచే నడిపించ బడుతోంది. సమస్తానికి ఆత్మే ఆధారం.మహాచైతన్య పదార్థమైన ఆత్మే బ్రహ్మ.

మహాచైతన్య పదార్థమైన ఆత్మను అవగతం చేసుకున్నవాడు, శరీర పతనానంతరం స్వర్గానికి వెళతాడు. సమస్త కోరికలు తీరినవాడై అమరత్వస్తితిని పొందుతాడు.

No comments:

Post a Comment