ఓం నమో పరమాత్మయే నమః
నాశరహితమగు
పరబ్రహ్మమేది కలదో దానిని యజ్ఞోనముగా ధరించవలెను.
ఈ ప్రపంచమంతయు
దారమునండు మణులవలె దేనితో గ్రుచ్చబడియున్నదో, అట్టి బ్రహ్మ సూత్రమును యోగవేత్తయు,
పరబ్రహ్మ తత్వము తెలిసినట్టియు నగు యోగి ధరించును.
అద్వితీయుడును,
స్వయంప్రకాశుడును అగు పరమాత్మా సమస్త ప్రాణులందును నిగూడముగా నున్నవాడును, సర్వ
వ్యాపకుడను, సర్వ భుతాంతర్వర్తియగు ఆత్మస్వరూపమును, సర్వాధ్యక్షుడును, సర్వ
ప్రాణులందును అధినసించి యున్నవాడును సాక్షియు, చైతన్యరూపుడును, నిర్గుణుడును
అయియున్నాడు.
అద్వితీయుడును,
సమస్తమును స్వాదీనపరుచుకొనియుండు వాడును, సర్వభుతాంతరాత్మయు అగు ఏ పరమాత్మా ఒక్క
రూపమునే అనేక రూపములుగా చేయునో, అట్టి హృదయమునందుండు పరమాత్మను ఏ ధీరులు
దర్శించుడురో వారికే శాశ్వతమగు శాంతి లభించును గాని తదితరులకు కాదు.
మనస్సును
క్రిందికట్టెగను, ఓంకారమును పైకట్టెగను చేసి, ధ్యానాభ్యాసమున మధనమున గావించి
నిగూడముగనున్న ఆత్మ దేవుణ్ణి దర్శించవలయును.
నువ్వులయండు
నూనెవలెను, పెరుగులో వెన్నవలెను, ప్రవాహమునందు జలమువలెను, కొయ్యలందు అగ్నివలెను
ఆత్మా అంతఃకరణమున నిగుడముగా నున్నది. సత్యము చేతను, తపస్సు చేతను, ధ్యానాభ్యాసము
చేతను అట్టి ఆత్మస్వరూపమును మనుజుడు సాక్షాత్కరించుకోనవలెను.
వాక్కు, మనస్సు, ఏ
పరబ్రహ్మమును చేరలేక వెనుకకు మరలుచున్నవో, విజ్ఞుడు దేనిని తెలిసికొని ముక్తుడగుచున్నాడో,
అదియే జీవుని పరమాస్థి ఆనందము.
బ్రహ్మవిద్య జ్ఞాన
తపస్సులే మూలముగాగల పరమాత్మను పాలయందు నేయివలె సర్వవ్యాపిగా బ్రహ్మవేత్తలు
తెలిసికొనుచున్నారు.
No comments:
Post a Comment