Monday, March 31, 2014

౩౦. సుబాలోపనిషత్తు :

శరీరము లోపల హృదయగుహయందు అజుడు, నిత్యుడు, అద్వితీయుండు నగు పరమాత్మా కలడు. అతనికి ప్రుథివి శరీరము. అతడు ప్రుథివిలో సంచరించును. కాని అతనిని ప్రథివి ఎరుగనేరదు. అట్లే అతనికి జలము శరీరము. అతడు జలమునందు సంచరించును .కాని జల మాతనిని ఎరుగలేదు.
ముముక్షువు శాంతుడు ,దాంతుడు, ఉపరతుడు. తితిక్షువు సమాధినిష్టుడుగ నయి తన అంతరాత్మయందే పరమాత్మను దర్శించుచున్నాడు. ఆ పరమాత్మ నెరిగిన విజ్ఞుడు సర్వముయోక్క ఆత్మయగుచున్నాడు.

బ్రహ్మనిష్టుడు మహత్తరమగు అత్మపదము నెరిగినవాడై వృక్షముక్రింద నివసింపవలయును. వైరాగ్యశీలుడు, వివేకవంతుడు, ముముక్షువు నగు ఆ విజ్ఞుడు పరిమితవస్త్రమును ధరించిన వాడై,  అన్యసహాయము లేనివాడై, ఏకాకియై, సమాధినిష్టుడై, ఆత్మకాముడు, ఆప్తకాముడు, నిష్కాముడు, జీర్ణకాముడునై ఏనుగునందును, సింహమునందును, ఈగనందును, దోమయందును, ముంగిసయందును, గంధర్వునియందును భగవంతుని యొక్క రూపములు తెలిసికొని దేనివలనను భయముజెందని వాడై యుండును. చేదింపబడుచున్న వాడైనను వ్రుక్షమువలె క్షమాశీలుడై కోపముంజెంచక యుండవలెను. సత్యశీలుడై యుండవలెను. పరమాత్మ సత్యస్వరూపమైనది.

No comments:

Post a Comment