25.
కౌషీతకీబ్రాహ్మణోపనిషత్తు :
విజ్ఞుడగువాడు
(ఆధ్యాత్మిక సాధనలద్వారా) సమస్త పదార్థములకంటెను శ్రేష్టమైనట్టి స్వారాజ్యమును
(మోక్షమును), ఆత్మ సామ్రాజ్యాదిపత్యమును పొందుచున్నాడు.
26.
బృహజ్జాబాలోపనిషత్తు :
ఎచట సూర్యుడు వేలగడో,
ఎచట వాయువు వీయదో, ఎచట చంద్రుడు వేలుగడో, ఎచట నక్షత్రములు భాసిల్లవో, ఎచట అగ్ని
దహించదో, ఎచట మృత్యువు ప్రవేసించదో, ఎచట దుఃఖములు ప్రవేసింపవో, ఏది సదానందమై,
పరమానందమై, శాంతమై, శాశ్వతమై, సదా మంగళ స్వరూపమై, బ్రహ్మాదిదేవతానందితమై
యోగిజనధ్యేయమై యున్నదో, దేనిని పొంది జనులు తిరిగి జన్మను పొందారో అదియే
పరమాత్మస్థానము.
No comments:
Post a Comment