31. క్షురికోపనిషత్తు :
సాధకుడు నిషబ్దముగానున్న ప్రదేశమున సముచితమైన ఆసనము వేసికొని
కూర్చుండి తాబేలు తన అవయవములను ఉపసంహరించుకొనునట్లు సర్వెంద్రియములను విషయములనుండి
మరలించి, మనస్సును హృదయమునందు నిశ్చలముగా నిలిపి, పండ్రెండు దాత్రలుగల ప్రణవ
మంత్రముతో మెల్లమెల్లగ సర్వాత్మను దారించవలెను.
ఇంద్రియములను అన్నిటిని నిగ్రహించి, నిజిరచిత్తుడై, నిశబ్దమైన
ఏకాంతవాసమునందు సంగరహితుడై, సాంగయోగము నెరిగినవాడై, నిరపేక్షుడై, మెల్లమెల్లగా
పాశమును త్రెంచుకొని ఎగిరిపోవు హంసపక్షివలె జీవుడు చిన్నపాశుడై సంసారమును దాటి
మోక్షధామమును జేరి సుఖించును.
కామబంధమునుండి నిముక్తుడైన వెంటనే జీవుడు సర్వకామరహితుడై,
సంసారపాశములను చేధించి అమ్రుతత్వమును (మోక్షమును) పొందును. మరల అతడు బంధమును
పొందడు.
32. మన్త్రికోపనిషత్తు :
ఎవని యందు ఈ చరాచర జగత్తు కూర్చబడినదో, ఆ పరిశుభ్రమైన, సర్వవ్యాపకమైన
,అద్వితీయమైన పరమాత్మను బ్రహ్మనిష్టులు దర్శించుచుందురు. మఱియు నదులు సముద్రము
నందువలె అతనియందు లయమును బొందుచుందురు.
No comments:
Post a Comment