ఓం నమో పరమాత్మయే నమః
ఓం అను అక్షరమును
ఊహించవలయును. ఓం అని గానము చేయవలెను.ఏ విధంగా అమరమై, అమృతమై, అభయమై యుండు
ఓంకారమును ఊహించుచున్నాడో, అతడు దేవతలవలె అమృతత్వమును పొందును.
నామారూపాత్మకమగు ఈ
ప్రపంచమంతయు బ్రహ్మమే అయి యున్నది. ఈ జగత్తు దానినుండియే కలిగినది. దానియందే
లయమగుచున్నది. దానియందే ప్రతిస్టితమైయున్నది. కావున శాంతుడై బ్రహ్మమును ఉపాసించ వలయును.
నామరుపాలతో గుడిన ఈ
జగత్తు ఉత్పన్న మగుటకు పూర్వము సత్తుగా ఏకమై, అద్వితీయమై యుండినది.
ఓ శ్వేతకేతు! ఈ
సమస్త ప్రపంచము పరమాత్మచే పరిపూర్ణమై యున్నది. ఆ పరమాత్మయే సత్యము. అదియే ఆత్మ.
అదియే నీవై యున్నావు.
ఆచార్యుడైన మనుజుడు
బ్రహ్మమును తెలిసికొని వెంటనే మోక్షమును బడయుచున్నాడు.
సనత్కుమారుడు-భూమ
(గొప్పది, బ్రహ్మము,ఆత్మ) అనునదియే సుఖము – అల్పమైన దానియందు సుఖము ఉండదు. కావున
గోప్పదియే సుఖము. ఆ గోప్పదియగు ఆ ఆత్మనే తెలిసికొనవలయును.
దేనియందు(ఆత్మయందు)
దానికంటె వేరైనది ఏదియు కనబడుటలేదో, వినబడుట లేదో, తెలియబడుట లేదో, అదియే భూమ.
దీనికంటే వేరైనది అంతయు అల్పము. భుమా స్వరూపమగు ఆత్మ (బ్రహ్మము) నాశరహితమైనది.
అల్పమైన దానికి నాశము కలదు.
ఆ భూమ (ఆత్మ)
క్రింద, పైన, వెనుక, ముందు, ప్రక్కల అంతటయు నిండియున్నది. ఈ కనిపించు ప్రపంచమంతయు
అదియే. అదియే నేను. నేనే క్రింద, పైన ఎల్లెడల ఉన్నాను. అంతయు నేనుగా వున్నాను.
క్రింద, పైన, అన్ని
చోట్లను ఆత్మయే నిండియున్నది. అంతయు ఆత్మయే. ఈ విధముగా చుచియు, తలన్చియు,
తెలిసికోనువాడు అత్మయందే క్రీడించుచుండును. అత్మ తనయందే వున్నదని
ఆనందమొందుచుండును. తానె రాజైయుండును. సమస్త లోకములందును తన ఇష్ట ప్రకారము
వర్తించుచుండును. ఎవడు ఆత్మను మరియొక విధముగా ఎరుగునో అట్టి అజ్ఞాని ఇతర రాజుకు
లోబడియుండును. నాశముకల లోకములను పొందును. లోకము లన్నిటియందును తన ఇస్టప్రకారము
సంచరించుటకు అతనికి సాధ్యపడదు.
ఈ ప్రకారము ఆత్మను
తెలిసికోనినవాడు మృత్యువును చూడదు; రోగమును పొందడు; దుఃఖము నొందడు. సమస్తమును
ఆత్మగా చూచును. సమస్తమును సర్వవిధములుగా అగుచున్నాడు. సృష్టికి పూర్వము ఆ ఆత్మయే
(బ్రహ్మయే) యున్నది. తరువాత అదియే మూడై, ఐదై, ఏడై, తొమ్మిదై, అనేకమైనది.
మొట్టమొదట ఆహారమును
శుద్దముగా చూడవలెను. దానిచే అంతఃకరణ శుద్ధి కలుగును. దానిచే స్మరణ శక్తి కలుగును.
దానిచే అజ్ఞాన గ్రంధు లన్నియు విచ్చినములై పోవును. అతని దోషములు తోలిగిపోవును. అని
భగవంతుడు సానత్కుమారుడు నారదునికి తెలిపెను.
ఈ దేహమునకు
ముసలితనము కలిగినను బ్రహ్మమునకు (ఆత్మకు) అట్టి ముసలితనము కలుగదు. దేహమునకు దెబ్బ
తగిలినను బ్రహ్మమునకు తగలదు. ఈ బ్రహ్మపురము సత్యమైనది. దేహము సత్యము కాదు.
బ్రహ్మమునందు ఉత్తమ గుణములు ఆశ్రయించియున్నవి. ఈ ఆత్మ (బ్రహ్మము) పాపరహితమైనది.
దీనికి ముసలితనము, మరణము, శోకము, ఆకలి, దప్పిక లేవు.అది సత్యకామమై (అది తలంచిన
ప్రకారం జరుగును). సత్యసంకల్పమై యున్నది. ఇట్టి ఆత్మను తెలిసికొనవలయును. దానిని
తెలిసికోనినచో ఈ లోకమున రాజుయొక్క ఆజ్ఞానవర్తులై అనుసరించువారు ఏ యే ఫలమును, ఏ యే
ప్రదేశములలో కోరుదురో, దానినే పొండుడురుకాని సమస్తమును పొందనట్లు, సమస్తమును
స్వేచ్చగా పొందలేరు.
ఈ ఆత్మ హృదయమునందే
కలదు. ఈ ప్రకారము తెలిసికోనినవాడు ప్రతిదినము స్వర్గమును (బ్రహ్మమును) పొందును.
ఈ ప్రకారమెరిగినవాడు
సంప్రసాదుడనబడును. అట్టి వాడు (బ్రహ్మానుగ్రహము నొందినవాడు) దేహాత్మ భావాది
అజ్ఞానమునుండి తొలగి పరజ్యోతి స్వరూపమును(ఆత్మను) ఆశ్రయించి దానితో
ఐక్యమొందుచున్నాడు. కనుక జీవునకు అత్మయనెడి పేరు ఏర్పడినది(జీవాత్మ అని). ఆ ఆత్మ
అమృతమై, అభయమై, బ్రహ్మమై యున్నది. ఆ బ్రహ్మమునకు సత్యమని పేరు.
ఈ ఆత్మ సేతువు
(గత్తు౦ వంటిది. సర్వమును భరించుచున్నది. ఈ ఆత్మ కాలపరిచ్చేదము లేనిది. దానికి
ముసలితనము, మృత్యువు, శోకము, సుకృతి, దుష్క్రుతములు లేవు. కావున ఆత్మయందు సమస్త
పాపములు నసించిపోవుచున్నవి. అత్మలోకము పాపసంబంధము లేనిది. కావున సదా ఆత్మను ఈ
ప్రకారముగా ఉపాసించువారు స్వర్గమును (ఆత్మపదమును) పొందుచున్నాడు.
ఈ ఆత్మను
తెలిసికోనినచో అంధుడు (అజ్ఞానము కలవాడు) అంధత్వము లేనివాడగును. శరీరమున్నపుడే
అజ్ఞాని జ్ఞానియగును. శరీర మున్నపుడు, తచ్చరీరకార్యములచే దుఃఖమొందినవాడు సుఖమొందును.
సంకటము నొందినవాడు సంకటము లేనివాడగును. ఆత్మను పొందిన వానికి రాత్రి పగలగుచున్నది.
అతడు ఎల్లప్పుడు (జ్ఞాన) ప్రకాశముకలవాడై
ఆత్మైక్యము నొందును.
యజ్ఞమనునది
బ్రహ్మచర్యమే. జ్ఞానియగువాడు బ్రహ్మచర్యము వలన యజ్ఞఫలమును పొందుచున్నాడు.
బ్రహ్మచర్యముచే మనుజుడు ఆత్మను పొందుచున్నాడు.
హృదయమునందు నూటఒక్క
నాడులు కలవు. వానిలో ఒక్కనాడి (సుషుమ్న) మూర్ధమునకు పోవుచున్నది. దానిద్వారా
జ్ఞాని ఊర్ధ్వమునకేగి అమ్రుతత్వమును పొందుచున్నాడు. ఇతర నాడులు అడ్డముగా అంతటా
వెల్లుచున్నవి.
ఆత్మ పాపరహితమైనది.
వార్ధక్యము లేనిది, మరణము లేనిది, శోకము లేనిది, ఆకలిదప్పికలు లేనిది. అది
సత్యకామమును, సత్యసంకల్పమును అయియున్నది. ఇట్టి ఆత్మను బాగుగ వెదకి
తెలిసికోనవలెను. అట్లు తెలిసికోనినవాడు సమస్తలోకములను, సమస్త అభిలాషలను
పొండుచున్నాడని ప్రజాపతి చెప్పెను.
No comments:
Post a Comment