Monday, March 31, 2014

27-1. నృసింహపూర్వతాపిన్యుపనిషత్తు ; 27-2. నృసింహొత్తరతాపిన్యుపనిషత్తు :

27-1. నృసింహపూర్వతాపిన్యుపనిషత్తు :
ఈ పరమాత్మా సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, అంతర్యామి, సమస్త జగత్తునకు జన్మస్థానమైనవాడు. ప్రాణికోట్లయొక్క జనన మరణములకు ఆధారభూతుడు.
27-2. నృసింహొత్తరతాపిన్యుపనిషత్తు :
ఆత్మ నిత్యానందస్వరూపమైనది. సత్యమైనది. ఏకరసమైనది. నేత్రేంద్రియమునకు ద్రుష్టమైయున్నది. అట్లే శ్రోత్రేంద్రియమునకు, వాగింద్రియమునకు, మనస్సునకు, బుద్దికి, ప్రాణమునకు, తమస్సునకు, సమస్తమునకు ద్రుష్టమైయున్నది. కావున ఆత్మ సర్వమున కంటె విలక్షణమైనది. ఆత్మ నేత్రమునకు సాక్షి. అట్లే శ్రోత్రమునకు, వాక్కునకు, మనస్సునకు, బుద్దికి, ప్రాణమునకు, తమస్సునకు, సమస్తముకు సాక్షియైయున్నది. కావున అది అవికారమైనది. మహాచైతన్యస్వరుపమైనది. ఈ సమస్త జగత్తుకంటె అత్యంత ప్రియమైనది. ఆనందఘనమైనది. ఈ సమస్త ప్రపంచమునకు ఎదుట మిగుల భాసించునది, ఏకరసమైనది, అజరమైనది, అమరమైనది, అభయమైనది, బ్రహ్మస్వరూపమైనది అయియున్నది.
అద్వితీయ మగుటచే ఈ ఆత్మ వికల్పరహితమైనది. ఈ ఓంకారము వికల్పరహితమైనది. ఈ ఓంకారము జ్ఞానస్వరూపమైనది. ఈ సమస్త జగత్తు వాస్తవముగా జ్ఞానస్వరూపమే యగును. ఆత్మ వికల్పరహితమైనది. ఇందు ఎంతమాత్రమును భేదము లేదు. ఆత్మ యందు భేదములు గాంచువాడు నూరు ఖండములుగాను, వేయి ఖండములుగాను వ్రక్కలై మృత్యువుపాలగుచుండును. ఈ జగత్తు అత్మస్వరూపమే యగును. ఆ ఆత్మ అద్వైతము, స్వయంప్రకాశము, మహానందము, అమరము, అభయము నగు బ్రహ్మమే యగును. అభయమైన బ్రహ్మము నెరుగు విజ్ఞుడు బ్రహ్మస్వరూపుడే యగును. ఇది పరమరహస్యమైనది.

అద్వాతమైన ఈ ఆత్మ స్మూత్రస్వరూపమైనది. నిత్యమైనది. బుద్దమైనది. సత్యమైనది. ముక్తమైనది. అసంగమైనది. వ్యాపకమైనది. అద్వైతానందస్వరూపమైనది. పరతత్వమైనది.ఏకరసమైన ప్రత్యగాత్మయైనది. ఈ ప్రమాణములచే నేరుంగబడు సన్మాత్రస్వరూపమైనది. ఆత్మ స్వీయ మహీమయందుండునది.నిష్కామమైనది. స్వయంప్రకాశస్వరూపమైన ఏకైక సాక్షి అయియున్నది.

25. కౌషీతకీబ్రాహ్మణోపనిషత్తు ; 26. బృహజ్జాబాలోపనిషత్తు :


25. కౌషీతకీబ్రాహ్మణోపనిషత్తు :
విజ్ఞుడగువాడు (ఆధ్యాత్మిక సాధనలద్వారా) సమస్త పదార్థములకంటెను శ్రేష్టమైనట్టి స్వారాజ్యమును (మోక్షమును), ఆత్మ సామ్రాజ్యాదిపత్యమును పొందుచున్నాడు.

26. బృహజ్జాబాలోపనిషత్తు :

ఎచట సూర్యుడు వేలగడో, ఎచట వాయువు వీయదో, ఎచట చంద్రుడు వేలుగడో, ఎచట నక్షత్రములు భాసిల్లవో, ఎచట అగ్ని దహించదో, ఎచట మృత్యువు ప్రవేసించదో, ఎచట దుఃఖములు ప్రవేసింపవో, ఏది సదానందమై, పరమానందమై, శాంతమై, శాశ్వతమై, సదా మంగళ స్వరూపమై, బ్రహ్మాదిదేవతానందితమై యోగిజనధ్యేయమై యున్నదో, దేనిని పొంది జనులు తిరిగి జన్మను పొందారో అదియే పరమాత్మస్థానము.

2౩. అధర్వశిఖోపనిషత్తు ; 24. మైత్రాయణ్యుపనిషత్తు :

2౩. అధర్వశిఖోపనిషత్తు :
ఇతరమైన సమస్తమును పరిత్యజించి శినంకముడైన (మోక్షము నొసంగువాడైన) శివునే (శుభ్రప్రదుడైన పరమాత్మను) ఒక్కనినే ధ్యానించవలెను.
24. మైత్రాయణ్యుపనిషత్తు :
(బృహద్రధుడను రాజు శాకాయన్యుడను ఋషి నిట్లు అడిగెను).
మహాత్మా! ఎముకలు ,చర్మము, నరములు, మజ్జ, మాంసము ,శుక్లము, శోణితము, శ్లేషము ,కన్నీరు – వీనిచే దూషితమైనదియు ,మలమూత్రములచే వాతపిత్తకఫలములచే దుర్లంధమైనదియు ,సారహీనమైనదియు నగు ఈ శరీరమునందు కామభోగములచే జనులకు కలుగులాభమేమి?
మహాశయా! కామము, క్రోధము, లోభము, మోహము, భయము, విషాదము ,ఈర్ష్య, ఇష్టజనవిరహము, అనిష్టప్రాప్తి ,ఆకలి, దప్పిక, ముసలితనము,మరణము ,రోగము, శోకము మొదలైన వానిచే అభిహతమైన ఈ శరీరమునందు కామభోగాములచే కలుగు లాభమేమి?
ఈ ద్రుశ్యజగత్తు అంతయు నాశవంతముగా కనబడుచున్నది. ఈ ఈగలు ,దోమలు మొదలైన కీటకములు పచ్చగడ్డివలె పుట్టుచు, గిట్టుచు, నశ్వరములై యున్నవి.
గొప్ప ధనుర్దారులైన చక్రవర్తులు కొందరు కలరు. వారు అంతా బహుసంఖ్యాకములైన ధనసంపదలను వారు త్యజించివేసి ఇహలోకమునుండి పరలోకమునకు పోయిరి. 
మహాసముద్రములు ఎండిపోవుచున్నవి, పర్వతములు కూలిపోవుచున్నవి, ధ్రువనక్షత్రములు సంచలించుచున్నది, చెట్లు నిలుచుటలేదు. భూవలయము మునిగిపోవుచున్నది. దేవతలు స్థాన భ్రస్టులగుచున్నారు. ఇట్టి సంసారమునందు కామభోగములచే కలుగు లాభమేమి? కమభోగాశ్రయుడైన జీవుడి లోకమున అనేక జన్మలను బొందుచుండుట కానబడుచున్నది. పూజనీయ! సెలవిండు, మీరే మాకు దిక్కు!
రాజా! పరిశుద్దమైన జీవుడు ఈ శరీరమునుండి నిష్క్రమించి పరంజ్యోతిలో ఐక్యమవును. ఇదియే ఆత్మ. ఇది అద్భుతమైనది. అభయమైనది. ఇదియే బ్రహ్మము.
పరమగు ఈ ఆత్మ పరిశుద్దమైనది ,స్థిరమైనది, నిశ్చలమైనది, అసంగమైనది, అవ్యగ్రమైనది, నిస్ప్రుహమైనది. నాటకమునుగాంచు ప్రేక్షకుని భంగి యుండునది. గుణమయమైన వస్త్రముచే తన స్వరూపమును అచ్ఛాదించుకొనియుండునది అయియున్నది.
శబ్దము, స్పర్శము మొదలైన విషయములు మనుష్యులకు అనర్ధములవలె నున్నవి. అనర్ధకములైన అట్టి విషయములందు ఆసక్తుడైన జీవుడు పరంధామమైన మోక్షమునుగూర్చి తలంచుటలేదు.
తపస్సుచే సత్వగుణము కలుగును. సత్వగుణముచే పరిశుద్దమైన మనస్సు ఏర్పడును. అట్టి పరిశుద్ద మనస్సుద్వార ఆత్మ లభించుచున్నది. ఆత్మ లాభముచే జీవునకు పునరావృత్తిరహిత కైవల్యము సంప్రాప్తించుచున్నది.
కట్టెలు లేని అగ్ని తనయందే తానూ ఉపశమించునట్లు, వృత్తులు (సంకల్పములు) నశించుటచే మనస్సు తనయందే తాను ఉపశమించుచున్నది.
చిత్తమే సంసారము. చిత్తమును ప్రయత్నపూర్వకముగా శుద్ధ మొనర్పవలయును. చిత్తము ననుసరించి స్వభావము, చేష్టలు, అభ్యాసములు కలుగుచుండును. ఇది పురాతనమైన రహస్యము.
చిత్తముయొక్క నిర్మలత్వముచే జీవుడు కర్మలను నశింపజేయుచున్నాడు. పరిశుద్ద మనస్సుకలవాడు ఆత్మయందు స్థితుడై అక్షయసుఖ మనుభవించుచున్నాడు.
మనస్సు శుద్దమని, అశుద్దమని రెండు విధములుగా చెప్పబడింది. కామసంకల్పములతో కూడినది అశుద్దమనియు, కామవర్జితమైనది శుద్ధ మనియు ఎరుంగవలయును.
మనస్సును లయ, విక్షేపరహితముగాను, మహానిశ్చలముగను గావించి ధ్యానశీలుడు అమనస్కభావమును ఎపుడు పొందునో, అపుడు పరమాత్మపదమును బడయును.
సాధకుడు తన హృదయమందలి సంకల్పములు నిశ్సేషముగా నశించిపోవువరకు మనస్సును నిగ్రహించవలయును. సంపూర్ణ మనోనిగ్రహమే జ్ఞానము. అదియే మోక్షము. ఇక తక్కిన బోధలన్నియు గ్రంధవిస్తారమే యగును.
నిశ్చల సమాధినిష్టచే మనోమాలిన్యము తొలగిపోగా, అట్టి నిర్మల మనస్సు ఆత్మయందు ఉంచబడినపుడు కలుగు సుఖమును వాక్కుతో వర్ణించుటకు శక్యము కాదు. ఆ సుఖము స్వయముగా తన అంతఃకరణము ద్వారానే అనుభవింపబడగలదు.
ఈ అక్షరపరబ్రహ్మము మహా పవిత్రమైనది. దీని నెరిగిన వాడు ఏది కోరునో అది వానికి లభించును.

తీవ్ర వైరాగ్యశాలియగు సాధకుడు సర్వజీవులకును అభయమొసంగి, ఎకాంతమునకు పోయి శబ్దాది విషయములను తననుండి బహిష్కరించి పరిశుద్దాత్ముడై, తన శరీరమునుండియే (అంతరంగ మందు) పరమాత్మను పొందును.

Sunday, February 16, 2014

22. అధర్వశిరోపనిషత్తు :



ఉచ్చరింపగనే శరీరమంతను పైకి లేవదీయును కాబట్టి ఓంకారము అని చెప్పబడుచున్నది.
ఉచ్చరింపగనే ఉచ్చరించు బ్రహ్మనిష్టులకు ఋగ్యజుస్సామాధర్వణవేదములను, షడంగములు మున్నగు వానిని జపయజ్ఞము నందు బ్రహ్మమును పొందింపజేయును. కావున ఓంకారము (ప్రణవము) అని చెప్పబడుచున్నది.
ఉచ్చరింపగనే గర్భ, జన్మ, జరామరణరూప సంసారము యొక్క మహాభాయము నుండి తరింపజేయును, కావున ఓంకారము తారమని చెప్పబడుచున్నది.
ఉచ్చరింపగనే వృద్దిని పొందుటవలన ఇతరములైన వానిని (జ్ఞానాదులను) వృద్దిని పొందింపజేయుటవలన ఓంకారము పరంబ్రహ్మ అని చెప్పబడుచున్నది.
సమస్త పదార్థములను చూచుచుండుటవలనను, ఆత్మజ్ఞానమును కలుగజేయుటవలనను, యోగమును (జీవబ్రహ్మైక్యమును) పొందింపజేయుటవలనను, పరమాత్మ భగవాన్ అని చెప్పబడుచున్నాడు.
ఓ జనులారా! ఈ ఏకరూపుడై స్వయంప్రకాశుడైన దేవుడు సమస్త దిక్కులను, అహంతర దిక్కులను వ్యాపించియున్నాడు. అతడే సర్వులకు పుర్వుడుగా ఉదయించెను. మరియు బ్రహ్మాండ గర్భములో అతడే పుట్టినవాడు, అతడే పుట్టబోవువాడు. అతడు ప్రత్యగాత్మ స్వరూపుడు, సర్వతోముఖుడు అయి యున్నాడు.
కేశాగ్రభాగ(సూక్ష్మ) పరిమాణము కలిగియున్నవాడును, హృదయమందుండువాడును, విశ్వస్వరూపుడును, స్వయంప్రకాశుడును, వేదమునకు ఉత్పత్తిస్థానమైనవాడును, శ్రేష్టుడును, అంతఃకరణమున ఉన్నవాడును అగు పరమాత్మను ఏ ధీరులు చూచుచున్నారో అట్టివారికి శాశ్వతమగు శాంతి కలుగునుగాని ఇతరులకు కాదు.
ఒక్కడగు ఏ పరమాత్మ ప్రతి శరీరమునందును వెలయుచున్నడో, ఎవనిచే ఈ పంచవిధమైన సకల ప్రపంచము స్థితిని బొందియున్నదో, సర్వనియంతయు పరిపూర్ణుడును, స్వయంప్రకాశుడును, స్తుతింపదగినవాడును అగు అట్టి పరమాత్మను ధ్యానించవలయును. అట్టి ధ్యానముచే సంసారతారకమగు మహత్తర శాంతిని మనుజుడు చక్కగా పొందుచున్నాడు.
అగ్నియే భస్మము, వాయువే భస్మము, జలమే భస్మము, స్థలమే భస్మము, ఆకాశమే భస్మము, ఈ సమస్తము భస్మము, మనస్సు, ఈ నేత్రాది ఇంద్రియములను భస్మమే. అగ్నిరితిభస్మ ఈ మున్నగు ఏడు మంత్రములచేత భస్మమును గ్రహించి, దేహమునకు పూసికొని శిరస్సు మొదలగు అవయవములను తాకవలెను .అందుచేత ఈ వ్రతము పాశుపతము అనబడుచున్నది. ఇది అజ్ఞానులగు జీవులయొక్క అజ్ఞాన, తత్కార్యములయొక్క విమోక్షణము కొఱకు అయియున్నది.

Tuesday, January 28, 2014

21. అమృతనాదోపనిషత్తు :

ఓం నమో పరమాత్మయే నమః 

బుద్ధిమంతుడు శాస్త్రములను బాగుగా అధ్యయనము చేసి, అందలి ధర్మములను మరల మరల అభ్యాసము చేసి పరబ్రహ్మమును తెలిసికొని, ఆ పిదప కోరదగినవి కాని వాటినన్నిటిని త్యజించవలెను.
ఓంకారమను రధమునెక్కి, విష్ణుమూర్తిని సారధిగా జేసికొని పరబ్రహ్మ స్థానమును వెదకుచు రుద్రారాధన తత్పరుడవై యుండవలెను.
బ్రహ్మలోక యాత్రాపరుడైన సాధకుడు రాధమార్గ మున్నంతవరకు రాధాములోపోయి, తదుపరి రధమును వీడి బ్రహ్మలోకమున కేగవలెను.
శబ్ద, స్పర్శాది విషయములైదు, అతిచంచలమగు మనస్సు అను పగ్గములను వశమునందుంచుకొని, సంయమశీలుడై యుండుట ప్రత్యాహార మనబడును.
ప్రత్యాహారము, ధ్యానము, ప్రాణాయామం, ధారణ, సత్యా సత్య విచారణ, సమాధి అను ఆరు అంగములు యోగమని చెప్పబడును.
పర్వత (గైరిక) ధాతువులను కొలిమిలో పెట్టి ఊదుటవలన, వాని యందలి మాలిన్యము తొలగి పోవునట్లు, ఇంద్రియములకు చెందిన దోషములు ప్రాణాయామముచే నశించిపోవు చున్నవి.
ప్రాణాయామముచే మనస్సునందలి దోషములను నశింపజేయవలెను. ధారణీలతో పాపమును నశింపజేయవలెను. ప్రత్యాహారముచే సంసర్గదోషములను నశింపజేయవలెను. ధ్యానముచే అనాత్మీయములైన ప్రాకృతగుణములను నశింప చేయవలెను.
పాపమును నశింపజేసికొని ఉత్తమమైన ఆత్మను గూర్చి చింతన చేయవలెను.
న్యాహృతితో కూడినదియు, ఓంకారసహితమైనదియు నగు గాయత్రిమంత్రమును శిరస్సుతో గూడ ప్రాణసంయమశీలుడైన సాధకుడు మూడుసార్లు పఠించవలెను. అయ్యది ప్రాణాయామమనబడును.
గ్రుడ్డివానివలె రూపములను చూడుము. చెవిటివానివలె శబ్దములను వినుము. దేహమును కొయ్యవలె చూడుము. ఇదియే ప్రశాంతుని యొక్క లక్షణమై యున్నది.
సంకల్పరూపమైన మనస్సును విచారణచే బాగుగా తెలిసికొని బుద్ధిమంతుడు తన యా మనస్సును ఆత్మయందు స్థాపించి, ధ్యానశీలుడై యుండుట ధారణ యనబడును.
వేదములను అనుగుణ్యముగా ఊహించుట తర్కమని చెప్పబడును. దేనిని పొంది సర్వత్ర సమముగా నున్న పరబ్రహ్మమందు నిలుకడగలగి యుండునో అది సమాధియని చెప్పబడును.
ఏకాక్షరమును, బ్రహ్మస్వరూపమును అగు ఓంకారముతో బ్రహ్మధ్యానపూర్వకముగా రేచకము సలుపవలెను. ఈ ప్రకారముగా దివ్యమంత్రముతో అనేక పర్యాయములు రేచకాదులను సలుపుచు, మనస్సునందలి దోషములెల్ల నశించి పోవువరకు ఆ ప్రకారము జపధ్యానాదులను గావించుచుండవలెను.
అడ్డముగాని, నిలువుగాని, క్రిందుగాను ప్రసరించునట్టి దృష్టినివీడి ధ్యానశీలుడు స్థైర్యము కలవాడై, నిశ్చల శరీరుడై సదా యోగమును లెస్సగా అభ్యాసము చేయవలెను.

ధ్యానపరుడైన యోగి భయమును, క్రోధమును, సోమరితనమును ,అతినిద్రను, అతిజాగారనమును, అధికాహారమును ,ఆహారములేమిని, సదా వర్జించవలెను.   

Wednesday, January 15, 2014

20. అమ్రుతబిందూపనిషత్తు :


ఓం నమో పరమాత్మయే నమః 

మనస్సు శుద్ధ మనియు, అశుద్ధ మనియు రెండు విధములుగా చెప్పబడినది. కోరికలుకల మనస్సు ఆశుద్దమును, కోరికలులేని మనస్సు శుద్దమును అగును.
మనుజుల యొక్క బంధ, మోక్షములకు కారణము మనస్సే అయి యున్నది. విషయములందు ఆసక్తమైయున్న మనస్సు బంధమును, విషయరహితమైన మనస్సు మోక్షమును పొందును.
విషయాసక్తముకాని మనస్సునకు మోక్షము కలుగునని చెప్పబడినందు వలన ముముక్షువు నిత్యము తన మనస్సును విషయ రహితముగా చేయవలెను.
విషయమందలి ఆశక్తిని వదలి హృదయమందు చక్కగా నిరోధింపబడి ఎపుడు మనస్సు సదా ఆత్మ స్వరూపమును పొందునో అపుడది ఉత్తమమైన పదము(స్థానము) కాగలదు.
హృదయమందలి సంకల్పములు క్షయ మగునంతన అగు మనస్సును నిరోధింపవలయును. ఇదియే ధ్యానము. ఇదియే యోగము, తక్కిన న్యాయము (వాక్యము) లన్నియు నిస్సారమే కాగలవు.
ఆ బ్రహ్మము నిష్కలమై, నిర్వికల్పమై, నిరంజనమై యున్నది. ఆ బ్రహ్మము నేను అని తెలిసికొనిన యెడల మనుజుడు సత్యముగా బ్రహ్మమే యగుచున్నాడు.
నిర్వికల్పమై, అనంతమై, కారనవర్జితమై, దృష్టాంతరహితమై అప్రమేయమై, అనాదియైనట్టి ఆ బ్రహ్మమును తెలిసికొని జ్ఞానీ బంధమునుండి విడివడు చున్నాడు.
నిరోధము లేదు, ఉత్పత్తిలేదు, బద్దుడు లేదు, సాధకుడు లేడు, ముముక్షువు లేడు, ముక్తుడు లేడు ఇదియే పరమార్ధ తత్త్వము.
మననము చేయదగిన ఆత్మ జాగ్రత్ ,స్వప్న, సుషుప్తులయందు ఒక్కటే అయియున్నది. ఆ జాగ్రత్, స్వప్న, సుషుప్తులను మూడు అవస్థలను దాటినవానికి పునర్జన్మము లేదు.
ప్రాణులకు అత్మయైనది ఒక్కటే. అది సమస్త ప్రానులందును కలదు. ఆ ఆత్మ నీటి యందు చంద్రునివలె ఒకటిగాను ,అనేకము గాను కనుపించుచున్నది.
శబ్దాది ప్రపంచరూపమాయచే ఆవరింపబడి యుండువాడు ఆ మాయమగు అందకారము నుండి ప్రకాశమునకు వచ్చుట లేదు. (ప్రకాశరూప బ్రహ్మమును తెలిసికొనుట లేదు). ఆ అంధకారము తొలగినచో ఏకమైన స్థితిని ఒక్కడుగానే చూచుచున్నాడు.  
ప్రణవశబ్దమునందు నాశరహితమైన శ్రేష్టమైన బ్రహ్మము కలదు. ఆ ప్రణవశబ్దము లయించగా ఏ అక్షర పరబ్రహ్మము శేషించుచున్నాడో, ఆ నాశరహితమగు పరబ్రహ్మమును ఆత్మ శాంతిని కోరు జ్ఞాని సదా ధ్యానించవలెను.
బుద్ధిశాలి వేదశాస్త్రాది గ్రంధములను బాగుగా అభ్యసించి జ్ఞాన, విజ్ఞానములందు తత్పరుడై, ఆ తదుపరి ధ్యానమును కోరువాడు పొత్తును వదలివేయునట్లు ఆ గ్రంధము నన్నిటిని వదిలి వేయవలెను.
ఆవులు పలురంగులు కలవి అయియున్నవి, వాని యొక్క పాలు ఒకేవర్ణము కలిగియుండు చున్నది. ప్రపంచమందలి బహువిధరూపములు ఆవులు. జ్ఞానరూపమగు ఆత్మ పాలలాంటిది.
పాలయందు నేయి నిగూడముగా నుండునట్లు ప్రతిప్రాణి యందును విజ్ఞానరూపమగు ఆత్మ నిగూఢముగా నున్నది. సదా మనస్సును మధించి ఆ అత్మయను నవనీతమును వెలువరించవలెను.     
మనుజుడు జ్ఞాననేత్రము కలవాడై మనస్సును మదించి నిష్కలమై, నిశ్చలమై, శాంతమైనట్టి బ్రహ్మమే నేను అని భావించి ఆ బ్రహ్మమును అనుభూత మొనర్చుకొనవలెను.
సమస్త ప్రాణులకు ఆధారముగా నున్నవాడనై, సమస్త ప్రాణులందు నివసించుచు, సమస్త ప్రాణులను సంరక్షించుచున్న వాసుదేవుడే నేను, ఆ వాసుదేవుడే నేను.

19. పరమహంసోపనిషత్తు :


ఓం నమో పరమాత్మయే నమః 

పరమహంసయగువాడు తనచిత్తమును నాయందే (భగవంతుని యందే) స్థాపించును. కాబట్టి నేనును అతనియందు ఉండుచున్నాను.
పరమహంస సమస్త కర్మలను త్యజించి బ్రహ్మాండమును (బ్రహ్మాండ భావమును) కూడ వదలివైచి (ఆత్మపరాయణుడై) యుండును.   
పరమహంస తన దేహమును శవము మాడ్కి (జడముగ) చూచును.
పరమహంస కోరిక లన్నింటిని త్యజించివైచి అద్వైత పరమాత్మయందు మనస్సును స్థాపించియుండును.
జ్ఞానదండమును ఎవడు ధరించునో అతడు ఎకదండి సన్యాసి యనబడును.
ఎవడు కేవలము కాష్టదండమును మాత్రము గ్రహించిన వాడను, ప్రాపంచిక భోగము లన్నింటిని అనుభావించువాడును, ఆధ్యాత్మిక జ్ఞానము లేనివాడును, తితిక్ష (ఓర్పు), జ్ఞానము, వైరాగ్యము, శమదమాదిగుణములు లేనివాడును, భిక్షాచరణ మాత్రముతో కాలమును గడపువాడును అయియుండునో అతడు పాపియు యాత్యాశ్రమవృత్తిని నశింపజేసినవాడును అగును.